Tuesday, May 7, 2024

ప్రధానిని కలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఏ.కృష్ణారావు.. పీవీపై రాసిన పుస్తకం బహూకరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడంపై సీనియర్ జర్నలిస్ట్ ఏ.కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రధానితో పార్లమెంట్ భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాను మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై రచించిన “ద క్వింటెసెన్షియల్ రెబెల్’ పుస్తకాన్ని నరేంద్ర మోదీకి బహూకరించారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, పరిపాలనపై దాదాపు 20 నిమిషాలకు పైగా ప్రధానమంత్రి కృష్ణారావుతో విస్తృతంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement