Sunday, May 5, 2024

రైల్వే ట్రాక్ రిపేర్లు, ప‌లు రైళ్ల ర‌ద్దు, మ‌రికొన్ని దారిమ‌ళ్లింపు.. వివ‌రాలు ఇవే!

రైల్వే ప్రయాణికులకు అల‌ర్ట్..! విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులతో పాటు ట్రాఫిక్ బ్లాక్ పనుల దృష్ట్యా రేపటి (అక్టోబర్ 9) నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసినట్లు.. కొన్నిటిని దారి మ‌ళ్లించిన‌ట్టు రైల్వే అధికారులు వెల్ల‌డించారు.

దారి మళ్లించిన‌వి ఇవే..

పలు రైళ్లను విజయవాడ, గుడివాడ మీదుగా భీమవరం వైపు దారి మళ్లించారు. అక్టోబర్ 9 నుంచి 13 వరకు ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును, ఈ నెల 10న హతీయ- బెంగళూరు(12835) రైలును, ఈ నెల 13న టాటా- బెంగళూరు (12889) రైలును, ఈ నెల 12న టాటా- యశ్వంత్‌పూర్ (18111) రైలును, ఈ నెల 9న హతియ- ఎర్నాకుళం (22837) రైలును విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

పూర్తిగా రద్దైన రైళ్ల వివ‌రాలు..

- Advertisement -

విజయవాడ-తెనాలి రైలు (07279) – అక్టోబర్ 9-15 వ తేదీ వరకు
తెనాలి-విజయవాడ రైలు (07575) – అక్టోబర్ 9 – 15 వ తేదీ వరకు
విజయవాడ- ఒంగోలు రైలు (07461) – అక్టోబర్ 11-15 వ తేదీ వరకు
ఒంగోలు- విజయవాడ రైలు (07576) – అక్టోబర్ 11-15 వ తేదీ వరకు
బిట్రగుంట-విజయవాడ రైలు (07977/07978) -అక్టోబర్ 11 -15 వ తేదీ వరకు
బిట్రగుంట – చెన్నై సెంట్రల్ రైలు (17237/17238)- అక్టోబర్ 9-13 వ తేదీ వరకు
విజయవాడ- గూడూరు రైలు (17259/17260) – అక్టోబర్ 11-15 వ తేదీ వరకు
విజయవాడ- గూడూరు రైలు (07500) – అక్టోబర్ 11-15 వ తేదీ వరకు

గూడూరు- విజయవాడ రైలు (07458) – అక్టోబర్ 12-16 వ తేదీ వరకు
రాజమండ్రి- విశాఖ రైలు (07466/07467) – అక్టోబర్ 9 -15 వ తేదీ వరకు
గుంటూరు- విశాఖ రైలు (17239/17240) – అక్టోబర్ 9 -16 వ తేదీ వరకు
విజయవాడ- విశాఖ రైలు (22701/22702) – అక్టోబర్ 9,10,11,13,14 తేదీల్లో రద్దు
రాజమండ్రి- విజయవాడ రైలు (07767) – అక్టోబర్ 9-15 వ తేదీ వరకు
విజయవాడ- రాజమండ్రి రైలు (07459) – అక్టోబర్ 9 -15 వ తేదీ వరకు
మచిలీపట్టణం- విశాఖపట్నం రైలు (17219/17220) – అక్టోబర్ 9 -16 వ తేదీ వరకు
విజయవాడ- గూడూరు (12743/12744) రైలును 11-16 వ తేదీ వరకు

పాక్షికంగా రద్దైన రైళ్ల వివ‌రాలు..


నర్సాపూర్-గుంటూరు రైలును (నెం. 17281/17282) అక్టోబర్ 9- 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేశారు. మచిలీపట్టణం-విజయవాడ రైలును (నెం.07896) అక్టోబర్ 9 -15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ- మచిలీపట్నం రైలు (నెం.07769), నర్సాపూర్- విజయవాడ రైలు (07883), విజయవాడ- మచిలీపట్టణం రైలు (07866), మచిలీపట్టణం-విజయవాడ రైలు (07770), విజయవాడ- భీమవరం జంక్షన్ రైలు(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లను అక్టోబర్ 9 నుంచి 15 మధ్య విజయవాడ రామవరప్పాడు మధ్య రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement