Tuesday, May 21, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్..ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా..

నిన్న‌టి వ‌ర‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు హోరు కొన‌సాగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో..ఇప్ప‌డు మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లుకానుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కి తెలుగు రాష్ట్ర‌ల్లో షెడ్యూల్ విడుద‌ల‌యింది. స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించి హైకోర్టు తీర్పు అడ్డంకిగా ఉండేది. అయితే, కోర్టు అనుమతితో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల భర్తీ పూర్తి అయింది. మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో వైసీపీ బలం పెరిగి శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకోనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఆరు స్థానాలకు నవంబరు 29న ఎన్నికలు జరగున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను వెలువరించింది. ఈ ఎన్నికలకు నవంబరు 9న నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మే 31తో ఖాళీకాగా.. తెలంగాణలో జూన్ 3న ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. మే 31న మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు, గోవిందరెడ్డిల పదవీకాలం ముగిసింది. దీంతో మూడు స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, శాసనమండలిలో మొత్తం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల నుంచి 11, ఎమ్మెల్యేల కోట నుంచి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. గత 6 నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు కోర్టు అనుమ‌తితో ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement