Thursday, May 2, 2024

స్థానిక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పరాజయం.. ఇంత ఓటమి ఎన్నడూ చూడలేదు: శశికళ

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ఇంత ఘోరమైన ఓటమిని ఎన్నడూ చూడలేదని పార్టీ సభ్యురాలు వీకే శశికళ పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే నాయకత్వంపై శశికళ విరుచుకుపడ్డారు.‘‘పార్టీని పోషించిన వారిని మరిచిపోవడంతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది’’ అని శశికళ అన్నారు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం.

చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డులకు గాను 153 వార్డులను గెలుచుకుని డీఎంకే స్వతంత్ర మెజారిటీని సాధించింది. ఎఐఎడిఎంకె తక్కువ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ వైవిధ్యం నుండి ఎంతో నేర్చుకోవాలని, మనం ఏకమైతే అభివృద్ధి చెందుతాము అని శశికళ అన్నారు. తాను నిత్యం కార్యకర్తలకు అండగా ఉంటానని, అన్నాడీఎంకే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement