Thursday, May 2, 2024

చైనాకు షాకిచ్చిన శాంసంగ్.. ఫ్యాక్టరీని ఇండియాకు తరలింపు

చైనాకు ఊహించని షాక్ తగిలింది. చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్‌ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ తొలుత నిర్ణయించింది. అయితే ఆ ప్లాంట్‌ను తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సోమవారం నాడు శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది.

ఈ సందర్భంగా శాంసంగ్ బృందం మీడియాతో మాట్లాడుతూ,… మెరుగైన పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానాల కారణంగా నోయిడాలో తమ ప్లాంటును పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు శాంసంగ్ కు సీఎం యోగి పూర్తి భరోసాను కల్పించారు. భవిష్యత్తులో కూడా శాంసంగ్‌కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement