Friday, May 3, 2024

దేశంలోనే నెంబర్‌ వన్ స్మార్ట్‌వాచ్‌ బ్రాండ్‌గా శాంసంగ్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : శాంసంగ్‌ ఇండియా, స్మార్ట్‌ వాచ్‌ అదేవిధంగా టీ-డబ్ల్యూఎస్‌ బిజినెస్‌ లలో తన నాయకత్వాన్ని సుస్థిరపరచుకొని 2022 మొదటి త్రైమాసికం చివరకు దేశంలోనే నెంబర్‌ వన్‌ స్మార్ట్‌ వాచ్‌ బ్రాండ్‌ గా ఉద్భవించింది. ఈసందర్భంగా శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ఆదిత్య బబ్బర్‌ మాట్లాడుతూ.. ఇండియాలో గెలాక్సీ వాచ్‌4 రెండంకెల వృద్ధి క్యూ ఓ క్యూ ని నమోదు చేసుకొందన్నారు.

గెలాక్సీ బడ్స్‌2 తన ప్రీమియం ధ్వని నాణ్యత, పెంపొందిత యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ తో హృదయాలను గెలుచుకోగా, బాడీ కంపోజిషన్‌, వ్యక్తిగతీకృతమైన స్లీప్‌ కోచింగ్‌ వంటి పరిశ్రమ దిగ్గజ ఫీచర్లకు ధన్యవాదాలన్నారు. తమ ఉపకరణాలు ఆఫ్‌లైన్‌ ఇండియా వ్యాప్తంగా 6000 ప్లస్‌ స్టోరులు, ఆన్‌లైన్‌ అగ్రగామి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు ఛానల్స్‌ రెండింటి వ్యాప్తంగా విస్తృతంగా లభించగలిగేలా చూసుకున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement