Monday, April 29, 2024

స‌మంత కంట క‌న్నీరు.. వీడియోతో…

మయోసైటిస్‌ కారణంగా సినీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న హీరోయిన్ స‌మంత హైదరాబాద్ లో జరిగిన త‌న తాజా మూవీ శాకుంతలం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ద‌ర్శ‌కుడు గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ద‌ర్శకుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ‘శాకుంతలం’ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. కథకి నాయకుడిగా దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత. సినిమా వెనుక హీరో దిల్ రాజు . ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్ రాజుగారికి ఇస్తున్నాను” అంటూ ఒక్కసారిగా ఆయన ఎమోషనలై క‌న్నీరు పెట్టుకున్నారు..దీంతో సమంత సైతం భావోద్వేగానికి గురై క‌న్నీటి ప‌ర్య‌త‌మ‌య్యారు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement