Thursday, May 2, 2024

త‌న ర‌క్ష‌ణ‌కోసం.. బుల్లెట్‌ ప్రూఫ్‌ ఎస్‌యూవీ కొన్న స‌ల్మాన్ ఖాన్

గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామ‌నే బెదిరింపులు వ‌స్తున్నాయి. సల్మాన్‌ టీమ్‌ ఫిర్యాదుతో లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌తోపాటు ఈ-మెయిల్‌ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్‌ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. గ్యాంగ్‌స్టర్‌ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారికాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఆ వన్యప్రాణులను వేటాడం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్‌ దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు.సల్మాన్‌ ఖాన్‌కు చంపుతామంటూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. గత నెల 19న ఈ కడల వీరునికి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి ఈ-మెయిల్‌ బెదిరింపులు వచ్చాయి.

దీంతో తన స్వీయ భద్రతపై దబాంగ్‌ స్టార్‌ దృష్టిసారించాడు. అత్యాధునిక హై ఎండ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌ అయిన నిస్సన్‌ పెట్రోల్‌ ఎస్‌యూవీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలో ఈ కారును నిస్సన్‌ కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. దక్షిణాసియా మార్కెట్‌లో మోస్ట్‌ పాపుల్‌ ఎస్‌యూవీ అయిన ఈ కారు.. అత్యంత ఖరీదైనది కూడా సల్మాన్‌ చెప్పారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులు, దాదాపు 10 మంది కానిస్టేబుళ్లు నిత్యం విధుల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. బాంద్రా శివారులోని సల్మాన్‌ నివాసం, ఆఫీస్‌ వెలుపల అభిమానులకు గుమిగూడే అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement