Tuesday, April 30, 2024

ఆర్ టి సి బస్, ద్విచక్ర వాహనం ఢీకొని.. ముగ్గురు మృతి

కోస్గి (ప్రభ న్యూస్) :ఎదురెదురుగా ఆర్ టి సి బస్, ద్విచక్ర వాహనం ఢీకొని స్పాట్లోనే ముగ్గురు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు గ్రామస్తుల సమాచారం మేరకు కోసిగి నుండి నారాయణపేట వెళుతున్న ఆర్టిసి బస్సు, గుండుమల్ నుండి కోసిగి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం గుండుమల్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైకుపై ఉన్న ముగ్గురు యువకులు శీను, బ్రహ్మేశ్, వెంకటేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు.

చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా అప్పటికే యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో బ్రహ్మేశ్, శీను ఇద్దరూ బలభద్ర పల్లి గ్రామానికి చెందిన వారు కాగా, మరొకరు వెంకటేష్ గుండుమల్ గ్రామం. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement