భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గత రాత్రి అట్టహాసంగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన ‘కాంతారా లో నటనకు గానూ రిషబ్శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా అలియాభట్ గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు పురస్కారాలను అందుకున్నారు.
ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ఫైల్స్’అవార్డు దక్కించుకుంది. .చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలందించినందుకుగానూ 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును రేఖ అందుకున్నారు