Sunday, May 5, 2024

జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ లో ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్‌ కాల్పులు.. ఎఎసైతో స‌హా నలుగురు మృతి

ముంబయి: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల కలకలం రేగింది. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో ఆర్పీఎఫ్‌ ఏఎస్సైతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. రైలు మహారాష్ట్రలోని పాల్గర్‌ స్టేషన్‌ దాటి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం దహిసర్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆయుధం స్వాధీనం చేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement