Friday, May 10, 2024

TS | వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. మృత దేహం లభ్యం

భూపాలపల్లి (ప్రభన్యూస్) : జయశంకర్ జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ(63) గల్లంతు కాగా.. ఆమె మృతదేహంను ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహ రెడ్డి తెలిపారు. సీఐ రామ్ మాట్లాడుతూ గురువారం మోరంచపల్లి లో నలుగురు గల్లంతు కాగా వాగు పరిసర ప్రాంతాల ఆయా గ్రామాల యువకులు, ప్రజల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

శనివారం రెండు మృత దేహాలు లభ్యం కాగా ఆదివారం నేరెడుపల్లి సర్పంచ్, గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాగా నేరేడు పల్లి శివారు చిర్రకుంట చెట్లపొదల్లో గొర్రె వజ్రమ్మ మృతదేహం ను గుర్తించామని తెలిపారు. ఇంకా మరొక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఎక్కడైనా మృతదేహాలు కనబడితే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement