Friday, May 3, 2024

రొమాంటిక్ గా ఎన్టీఆర్..ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కి టూర్ కి వెళ్లారు. కాగా అక్క‌డి నుండి త‌న భార్య ప్ర‌ణ‌తితో రొమాంటిక్ గా ఉన్న ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆ ఫొటో వైర‌ల్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ ఆ భాషలో మాట్లాడుతూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. కాగా ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్, ఎన్టీఆర్ తన భార్యను హగ్ చేసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement