Thursday, April 25, 2024

పల్నాడుపై పగపట్టిన టీడీపీ.. అల్లర్ల వెనుక బాబు, లోకేష్ ల హస్తం : ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

గుంటూరు : టీడీపీ పల్నాడు పై పగ పట్టింద‌ని, చంద్రబాబు, లోకేష్ కుట్రలో భాగమే మాచర్లలో మంటలు అని స్థానిక‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు అల్లర్లపై మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం గుంటూరు ఐబీలో మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేపిస్తున్నారు అన్నారు. బ్రహ్మరెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయ‌న్నారు. పల్నాడులో విధ్వంసానికి చంద్రబాబు, లోకేష్ లదే బాధ్యత అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నార‌ని, కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులు కర్రలు, రాడ్ లతో దాడులు చేస్తారా? అన్నారు. ఆస్తుల విధ్వంసానికి టీడీపీ నే కారణం అని, మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయ‌న్నారు. ఘటన పై విచారణ చేసి కారకుల పై అధికారులు చర్యలు తీసుకోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement