Thursday, May 9, 2024

మణిపూర్‌లో అల్లర్లు.. తెలంగాణ పౌరులను రప్పించేందుకు హెల్ప్‌ లైన్‌

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : మణిపూర్‌లో ఏర్పడిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసింది. హెల్ప్‌ లైన్‌ ఇంచార్జీగా డీఐజీ బి సుమతిని నియమించినట్లు డీజీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

మణిపూర్‌ పోలీసులతో మన పోలీసులు సమన్వయం చేసుకుంటూ మన పౌరులను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అవసరమున్న వారు హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 7901643283 నంబర్‌కు గానీ, డీజీపీ ఎట్‌ టీఎస్‌ పోలీస్‌ . గవ్‌. ఇన్‌కు మెయిల్‌ లో సంప్రదించవచ్చని డీజీపీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement