Sunday, May 19, 2024

Ministers: మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అన్నీ శాఖల అధికారుల సమన్వయంతో మొహర్రం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా సహకరిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్‌ బాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌నదీం, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement