Sunday, May 19, 2024

విద్యావలంటీర్ల పెండింగ్‌ వేతనాలు రిలీజ్.. రూ.5.76 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యావాలంటీర్లకు చెల్లించవల్సిన పెండింగ్‌ వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తూ ఈనెల 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 20 జిల్లాలకు సంబంధించిన విద్యావాలంటీర్ల కోసం రూ.5,76,99,000ను విడుదల చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల వేతనాలను ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు ఇచ్చి 20 జిల్లాలకు వేతనాలను విడుదల చేయలేదు.

ప్రస్తుతం ఆ 20 జిల్లాల్లోని విద్యావాలంటీర్లకు రావాల్సిన మూడు నెలల పెండింగ్‌ వేతనాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ఈనెల 10వ తేదీన వేతనాలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తెలంగాణ రాష్ట్ర విద్యావాలంటీర్ల సంఘం అధ్యక్షులు బానోత్‌ శివలాల్‌ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement