Monday, May 6, 2024

TS | ఇంటిగ్రేటేడ్‌ బీఈడీ నోటిఫికేషన్‌ విడుదల.. 3 విద్యాసంస్థల్లో కోర్సుకు ఎన్‌టీఏ అనుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ (డిగ్రీతోపాటు బీఈడీ) నోటిఫికేషన్‌ విడుదలైంది. నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ 2023 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ ఏడాది తెలంగాణలోని మూడు విద్యాసంస్థల్లో ఈ కోర్సుకు ఎన్‌టీఏ అనుమతినిచ్చింది.

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ వరంగల్‌ (నిట్‌), మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుమతి లభించింది. ఈ మూడు విద్యాసంస్థల్లో మొత్తం 250 సీట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2023లో వచ్చే మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతారు. దీనికి జూన్‌ 27 నుంచి జూలై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement