Thursday, April 25, 2024

ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం : బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి

ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామమ‌ని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. గత‌ తేడాది బడ్జెట్ మూలధనం 7.28 లక్షలు ఉండగా.. ఈసారి 10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్ లో చెప్పారని వివరించారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి అన్నారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. పౌరసరఫరాలకు కేటాయింపులు తగ్గినట్లు భావిస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్ లో వసతులకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తుందన్నారు. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు. ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement