Sunday, April 28, 2024

గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు తగ్గిన వరద… కడెం మినహా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి సామర్థ్యం నీరు..

రెండు రోజులుగా బేసిన్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్‌కు 26, 540 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం డ్యాం పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలుగా కాగా… 76.42 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

నిజాంసాగర్‌కు 3800 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1, 28, 456 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టుకు వరద వరద ఉధృతి 8725 క్యూసెక్కులకు తగ్గిపోయింది. కడెం ప్రాజెక్టు మినహా గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement