Friday, May 3, 2024

మరో బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌.. రూల్స్ పాటించలేదని ఆపరేషన్స్ నిలిపివేత

నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝళిపిస్తోంది. గత నెలలో సుమారు 8బ్యాంకుల ఆపరేషన్స్‌ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మార్గ దర్శకాలను పాటించని బెంగళూరుకు చెందిన కోపరేటివ్‌ బ్యాంకుకు ఆర్‌బిఐ గట్టి షాక్‌ను ఇచ్చింది. బెంగళూరుకు చెందిన కోఆపరేటివ్‌ బ్యాంకు శుశ్రుతి సౌహార్ధ సహకార బ్యాంకు నియమిత నిబంధనలను అతిక్రమించినట్లుగా ఆర్‌బిఐ గుర్తించింది.

అందుకుగాను ఈ బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాపై ఆంక్షలను విధించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు రూ.5వేలకు మించి విత్‌ డ్రా చేసుకోవడానికి వీలులేకుండా చేసింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ బ్యాంకు నుంచి రుణాలను, డిపాజిట్లను తీసుకోవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement