Wednesday, May 1, 2024

కర్నాటక కేబినెట్‌ సమూల ప్రక్షాళన.. జేపీ నడ్డాతే సీఎం బొమ్మై చర్చలు..

కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని యోచిస్తున్నారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విస్తృత చర్చలు జరిపారు. వచ్చేవారం తదుపరి దశ చర్చలు కొనసాగుతాయని, త్వరలోనే తుదినిర్ణయం వెలువడుతుందని బొమ్మై తెలిపారు. కేబినెట్‌ విస్తరణపై జేపీ నడ్డాతో విస్తృతంగా చర్చించాన. పార్టీ పెద్దలకు మొత్తం సమాచారం ఇచ్చాను. రాష్ట్రపార్టీ కార్యవర్గ సమావేశం కోసం తదుపరి చర్చ జరుగుతుందని నడ్డా చెప్పినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ఏప్రిల్‌ 16-17 తేదీల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన తర్వాత సీనియర్‌ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శిని సంప్రదించిన తర్వాత పార్టీ చీఫ్‌ తుది నిర్ణయం తీసుకుంటారని బొమ్మై చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధం కావాలో చర్చించాలని నడ్డా సూచించినట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గతవారం బొమ్మై ఢిల్లీ వెళ్లివచ్చారు. కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement