Sunday, May 5, 2024

టీమిండియాకు షాక్..హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోట్ సహా ఫిజియో థెరపిస్ట్ నిత్ న్ పటేన్ ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ వార్త టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు నిన్న సాయంత్రం రవిశాస్త్రికి పాజిటివ్ గా తేలింది.

ఇది కూడా చదవండి: BIG BOSS 5: నేటి నుంచే ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement