Friday, April 26, 2024

రేపిస్టులకు బెయిల్ ఇవ్వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ట్టం చేయాలి : కేటీఆర్

జువైనెల్‌ చ‌ట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్న‌ట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. అందుకే రేపిస్టులకు బెయిల్ ఇవ్వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని తాను డిమాండ్ చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్ ఘ‌ట‌న కేసులో రేపిస్టుల‌ను శ‌ర‌వేగంగా అరెస్టు చేశామ‌న్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపిన‌ట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల త‌ర్వాత హైకోర్టు ఆ రేపిస్టుల‌కు బెయిల్ మంజూరు చేసిన‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. చ‌ట్టం ప్ర‌కారం రేపిస్టుల‌కు శిక్ష‌ప‌డే వ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం పోరాడుతుంద‌ని తెలిపారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్య‌క్తి తుదిశ్వాస విడిచే వ‌ర‌కు జైలులో ఉండాల‌న్నారు. జీవిత ఖైదు శిక్ష‌ను నిజ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement