Friday, May 17, 2024

మిస్సింగ్ అత్త‌మ్మ అంటూ.. ఉపాస‌న పోస్ట్

మిస్సింగ్ అత్త‌మ్మ అని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. త్వరలో మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారు అని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అభిమానులు, సెలెబ్రిటీలు రాంచరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొణిదెల, కామినేని ఫ్యామిలీస్ లో సంతోషం రెట్టింపు అయింది. ఉపాసన గర్భవతి కావడంతో అప్పుడే ఆమె జాగ్రత్తలు మొదలు పెట్టారు.

తాజాగా ఉపాసన అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లారు. ఈ మేరకు ఉపాసన తాజాగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ఎంటర్ కావడం సంతోషంగా ఉంది అంటూ తన తల్లి, అమ్మమ్మ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేశారు. ఈ ఫొటోస్ కి మిస్సింగ్ అత్తమ్మ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మహిళలు గర్భవతి అయ్యాక పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. అందుకే ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement