Friday, May 3, 2024

‘మ‌నీ హైస్ట్’ త‌ర‌హాలో నోట్ల వర్షం.. జైపూర్‌లో ఎగబడిన జనం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముఖానికి మాస్క్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి జనం మీదకు నోట్లు విసిరివేశాడు. దీంతో కారు ఎదురుగా గుమిగూడిన జనం నోట్ల కోసం ఎగబడటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాదాపు 20 నిముషాల సేపు 20 రూపాయల కరెన్సీ నోట్లను అతడి విసిరివేశాడు.

అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబరు ఆధారంగా ఆగంతకుడి ఆచూకీ కనుగొని అరెస్టు చేశారు. అతను ఎందుకిలా చేశాడన్న విషయం మాత్రం తెలియరాలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement