Saturday, May 18, 2024

20వ తేదీ నుంచి పలు రైళ్ళు రద్దు

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ, గుంతకల్‌ మధ్య రైలుమార్గాల్లో మరమ్మతుల కారణంగా తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే పలు రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేది వరకు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ట్రైన్‌ నెం.17237 బిట్రగుంట-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, నెం.17238 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట రైళ్లు ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు రద్దయ్యాయి.

రైలు నెం.07659 తిరుపతి-కాట్పాడి, రైలు నెం.07582 కాట్పాడి-తిరుపతి స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ట్రైన్‌ నెం.06417 కాట్పాడి-జోలార్‌పేట, ట్రైన్‌ నెం.06418 జోలార్‌పేట-కాట్పాడి మెమో రైళ్లు ఈ నెల 20 నుంచి 26 వరకు, అలాగే ట్రైన్‌ నెం.06411 అరక్కోణం-కడప, ట్రైన్‌ నెం.06401 కడప-అరక్కోణం స్పెషల్‌ మెమో రైళ్లు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు రద్దయ్యాయి.

ఇదిలావుండగా ట్రైన్‌ నెం.16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, ట్రైన్‌ నెం.16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు తిరుపతికి బదులు కాట్పాడి నుండి బయలుదేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement