Thursday, May 2, 2024

స్థ‌లం ఖాళీ చేయండి – ప‌వ‌న‌సుతుడికే రైల్వే శాఖ నోటీసులు..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. మొరెనా జిల్లాలో సబల్‌గర్‌ ప్రాంతంలో రైల్వే బ్రాడ్‌గేజ్‌ పనులు జరుగుతున్నాయి. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని గుర్తించిన అధికారులు వెంటనే దానిని తొలగించాలంటూ ఆంజనేయుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు. కాగా, దీనిపై రైల్వే అధికారి మనోజ్‌కుమార్‌ వివరణ ఇస్తూ పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామని, గుడి పూజారి పేరిట కొత్త నోటీసు ఇస్తామని వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement