Thursday, April 25, 2024

వీడియో: ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ అనాథాశ్రమంలో రాహుల్ భోజనం చేశారు. ఆదివారం నాడు ఈస్టర్ పండుగ సందర్భంగా అక్కడి అనాథ బాలలతో కలిసి రాహుల్ గాంధీ విందు ఆరంగించారు. ఓవైపు భోజనం చేస్తూనే తన సోదరి ప్రియాంక గాంధీకి వీడియో కాల్ చేశారు. అనాథ పిల్లలు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో వీడియో కాల్‌లో మాట్లాడి మురిసిపోయారు. అంతకంటే ముందు వయనాడ్‌లోని తిరుణెల్లి ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈస్టర్ సందర్భంగా స్థానిక సెబాస్టియన్ చర్చిలో ప్రార్థనలు కూడా ఆచరించారు.

తన పర్యటన ముగిశాక కల్పెటలోని హెలీప్యాడ్ వద్దకు వెళ్లేందుకు వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓ సామాన్యుడి తరహాలో ఆటోలో ప్రయాణం చేశారు. కాగా రాహుల్ ఆటోలో ప్రయాణించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement