Thursday, May 2, 2024

Rahul and Priyanka: నేడు తెలంగాణ‌లో రాహుల్, ప్రియాంక ప‌ర్య‌ట‌న‌

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇవాళ తెలంగాణకు రానున్నారు. సాయంత్రం కాంగ్రెస్ బస్సు యాత్రను వారు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రం 3.30 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు రాహుల్, ప్రియాంక చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడ రామప్ప టెంపుల్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.


పూజలు చేసిన‌ అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాహుల్, ప్రియాంక గాంధీలు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. రామప్ప గుడి నుంచి బస్సు యాత్ర నేరుగా ములుగు చేరుకుంటుంది. ములుగు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement