Friday, May 17, 2024

కొత్త ఛాంబర్ లో మంత్రి పువ్వాడ

హైదరాబాద్/ ఖమ్మం : అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ అంతస్తులోని తన ఛాంబర్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సీట్లో ఆసీనులయ్యారు. సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి, CPI సీనియర్ నాయకులు, మంత్రి పువ్వాడ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి, తనయుడు Dr. నయన్, అపర్ణ, DR. నరేన్ లతో కలసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వచించారు. వేద పండితులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు శాస్త్రోక్తంగా వేద మంత్రోత్సవాల మధ్య, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిర్మించారని మంత్రి పువ్వాడ అభివర్ణించారు. ఈ శుభ సందర్బంగా యావత్ తెలంగాణ ప్రజలకు, రవాణా, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు

.ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మేల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ లు VP గౌతమ్, అనుదీప్, మేయర్ పునుకొల్లు నీరజ, RTC MD సజ్జనార్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్, జెడ్పి చైర్మన్ కమల్ రాజ్, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతామాలక్ష్మీ, DV, వివిధ మున్సిపల్ సంస్ధల చైర్మన్ లు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, నాయకులు పగడాల నాగరాజు, అంజిరెడ్డి, జస్వంత్, దేవభక్తుని కిషోర్ బాబు అధికారులు తదితరులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement