Thursday, May 2, 2024

నేటితో ఏడాది పూర్తి చేసుకున్న.. పుష్ప

ఎర్ర‌చంద‌నం నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రం రిలీజ్ అయి నేటికి సంవ‌త్స‌రం పూర్త‌యింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదీ 17 డిసెంబ‌ర్ 2021న రిలీజై సంచలన విజయం సాధించింది. హిందీలో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించింది. సుకుమార్ బ్రిలియంట్‌ టేకింగ్‌, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు భారతీయ సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమాతో బన్నీకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కాగా శనివారంతో ఈ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. సినీ సెలబ్రెటీల నుండి రాజకీయ నాయకులు, స్పోర్ట్స్‌ పర్సన్స్‌ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమాలోని బన్నీ మేనరిజంలను, డైలాగ్స్‌, హూక్‌ స్టెప్స్‌ను రీల్స్‌ చేశారు. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటించింది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement