Thursday, April 25, 2024

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కు నిరసిస్తూ పులివెందులలో ర్యాలీలో ధర్నాలు..

కడప బ్యూరో, ప్రభ న్యూస్ : పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా వైఎస్ఆర్ సీపీ నాయకుల శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులను విడిచిపెట్టి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. వివేక హత్య కేసులో కుట్ర కోణం ఛేదించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా పాత నివేదిక ఆధారంగా అరెస్టులు చేయడం కోర్టులను మోసగించడమేనని ఆరోపించారు. సీబీఐ పూర్వపు విచారణ అధికారులు చేసిన నివేదిక ఆధారంగా అరెస్టులు చేయడం కోర్టులను తప్పుదోవ పట్టించడమేని పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు దొరికిన లేఖ దాచడం వెనుక నిజాలు బయటకు రావాలన్నారు. డబ్బులు కోసం మనిషి ప్రాణాలు తీసిన కిరాయి హంతకుడు దస్తగిరి.. అలాంటి వ్యక్తి వాంగ్మూలాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారని ప్రశ్శించారు. వైఎస్ కుటుంబానికి మచ్చ తెచ్చేలా టీడీపీ ఆడిన కుట్రలో సీబీఐ పావుగా మారిందన్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ చేసిన పన్నాగం ఇదిన్నారు. అరచేయి పెట్టి సూర్యున్ని ఆపలేరు.. అలానే అరెస్టు చేసినంత మాత్రం అసత్యం సత్యం కాదన్నారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఈనాటిది కాదని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, చివరకు సత్యమే జయిస్తుందని అన్నారు. సీబీఐ విచారణ నుంచి కడిగిన ముత్యంలా వైఎస్ భాస్కర్ రెడ్డి బయటపడతారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.

వివేక హత్య కేసులో న్యాయం గెలవాలి..
వివేకా హత్య కేసులో న్యాయం గెలవాలి, నిజం బయటపడాలి అనేది వైఎస్ అవినాష్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, సమయం పట్టవచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంద‌ని నిరసన కారులు మాట్లాడారు. పులివెందల పాత బస్టాండ్ నుంచి పఊలంగళ్ళ సర్కిల్ దాకా శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement