Monday, April 29, 2024

ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులో – భారీగా నగదు స్వాధీనం

కర్నూల్ : పట్టణ శివారులోని పంచాలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ ఇ బి సి ఐ మంజుల, ఎస్ ఐ రాముడు, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి కడపకు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో , తంగేడు పల్లి గ్రామం, B కోడూరు మండలం,కడప జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తన బ్యాగులో రూ. 24.90 లక్షల నగదును తీసుకెళ్తుండగా గుర్తించారు..ఈ డబ్బుకు సంభందించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పగా సదరు వ్యక్తిని ,పట్టుబడిన నగదును తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ,ఖాజా,వెంకటేశ్వర్లు,మహమ్మద్ కానిస్టేబుళ్లు నారాయణ, విజయ భాస్కర్, పరుశ రాముడు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement