Monday, April 29, 2024

పృథ్వీషా మరో సెంచరీ బాదేశాడు

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ముంబై టీమ్ కెప్టెన్ పృథ్వీ షా ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు సాధించిన ఈ యువ బ్యాట్స్‌మెన్ తాజాగా నాలుగో సెంచరీ బాదాడు. క‌ర్ణాట‌క‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. కేవ‌లం 122 బంతుల్లోనే 17 ఫోర్లు, 7 సిక్స‌ర్లతో 167 ప‌రుగులు చేశాడు. ఈ టోర్నీలో పృథ్వీ 150కి పైగా స్కోర్లు చేయ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. ఇంత‌కుముందు రెండు మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా 227, 185 ప‌రుగులు చేశాడు. షా ఇన్నింగ్స్‌తో ముంబై.. 322 పరుగులు చేసింది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన పృథ్వీ ఇంగ్లండ్‌తో జట్టులో స్థానమే కోల్పోయాడు. తాజా విజృంభణతో ఐపీఎల్‌లో పృథ్వీపై భారీ అంచనాలు నెలకొనే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement