Friday, May 3, 2024

ఛాతిలో నొప్పి రావడంతో రాష్ట్రపతికి అస్వస్థత

దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రొటీన్ చెక్ అప్ జరుగుతోందని పేర్కొన్నారు. కాగా ఇటీవలే రాష్ట్రపతి తొలి విడత కరోనా వ్యాక్సిన్ డోస్ వేయించుకున్నారు.

కాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ మేరకు రామ్‌నాథ్ కోవింద్‌ కుమారుడు ప్రశాంత్‌తో మాట్లాడారు. రాష్ట్రపతి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement