Monday, May 6, 2024

మాన‌వ‌త్వ‌మే ముందుంటుంది-మేం నీతోనే ఉన్నాం-సాయిప‌ల్ల‌వికి..ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్ద‌తు

మాన‌వ‌త్వ‌మే అన్నింటికంటే ముందు ఉంటుంద‌ని ..కాబ‌ట్టి హీరోయిన్ సాయిప‌ల్ల‌వి మేం నీతోనే ఉన్నాం అని తెలిపారు సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. సాయిప‌ల్ల‌వికి మ‌ద్ద‌తుగా నిలిచారు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. క‌శ్మీర్ పండిట్ల హ‌త్య‌లు, గో హ‌త్య‌ల‌పై వ్యాఖ్య‌లు చేసి వివాదంలో చిక్కుకుంది సాయి ప‌ల్ల‌వికి..ఆమెకి మ‌ద్ద‌తుగా నిలుస్తూ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. హీరో రానాతో క‌లిసి తాను న‌టించిన విరాట ప‌ర్వం చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎవ‌రి ప‌క్షం అంటూ ఓ ప్ర‌శ్న ఎదురు కాగా… ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానిమ‌చ్చే క్ర‌మంలో సాయి ప‌ల్లవి క‌శ్మీర్ ప‌డింట్లు, గో హ‌త్య‌ల‌ను ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌లపై వివాదం రేగ‌గా… సాయి ప‌ల్లవి శనివారం వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ వివ‌ర‌ణ చూశాక సాయి ప‌ల్ల‌వికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement