Monday, April 29, 2024

ప్రొ.కబడ్డీ వేలం.. ప్రదీప్ నర్వాల్‌కు రూ.1.65 కోట్లు

ముంబైలో ప్రొ.కబడ్డీ వేలం జరుగుతోంది. ఈ వేలంలో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యూపీ యోధ జట్టు పీకేఎల్‌ వేలంలో సోమవారం అతణ్ని రికార్డు స్థాయిలో రూ 1.65 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌ చౌదరిని కేవలం రూ.40 లక్షలకు పుణెరి పల్టాన్‌ కొనుక్కోగలిగింది.

మరోవైపు సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్‌ రూ.1.30 కోట్లతో అట్టిపెట్టుకుంది. మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్‌ చేజిక్కించుకుంది. సచిన్‌ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్‌, రోహిత్‌ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్‌, సుర్జీత్‌ సింగ్‌ (రూ.75 లక్షలు)ను తమిళ్‌ తలైవాస్‌, రవిందర్‌ పాహల్‌ (రూ.74 లక్షలు)ను గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేశాయి.

ఈ వార్త కూడా చదవండి: జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పంట

Advertisement

తాజా వార్తలు

Advertisement