Friday, April 26, 2024

విజ‌యం కోసం పూజా హెగ్డే ఎదురు చూపులు..

నటి పూజా హెగ్డే ఇతర భాషల కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో అత్యధిక పారి తోషికం డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకుంది. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ, తమిళ్‌ సినిమాల్లో సైతం నటించింది. అయితే అకస్మాత్తుగా పూజా డిమాండ్‌ తగ్గిందనే మాట పరిశ్రమలో వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడమే అని అంటున్నారు.

తెలుగులో వరుస అపజయాలు చూసింది. రాధేశ్యామ్‌, సర్కస్‌, ఆచార్య, బీస్ట్‌ (తమిళ్‌) సినిమాలు ఆడలేదు. ఇదే సమయంలో సమంత, రష్మిక వంటి నాయికలు పుంజుకున్నారు. పూజకు తక్షణం సక్సెస్‌ వస్తేనే ఆమె కెరీర్‌ పరుగెడుతుందనే మాట పరిశ్రమలో వినిపిస్తోంది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి కిసికా భాయి… కిసికి జాన్‌ చిత్రంలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలవుతుంది. ఇది సాధించే ఫలితం పూజకు ఎంతో కీలకం. ఇకపోతే పూజాకు వరుస అవకాశాలు ఇస్తున్న త్రివిక్రమ్‌ తను మహేష్‌బాబుతో తీస్తున్న చిత్రంలో నాయికగా తీసుకున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రమిదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement