Wednesday, May 1, 2024

మీకు ఏం తెలుసో దాన్నే రాయండి..కాంతారపై పూజాహెగ్డే ప్రశంసలు

రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌ పోషించిన మూవీ కాంతార.. సెప్టెంబర్‌ 30న మాతృక భాష కన్నడలో విడుదలై భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి టాక్‌తో కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. ఈ సినిమాపై సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటి పూజా హెగ్దే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘‘మీకు ఏం తెలుసో దాన్నే రాయండి. మీ హృదయానికి చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. సినిమాలోని ఆఖరి 20 నిమిషాలు స్టన్యి పోయాను. పూర్తిగా నన్ను నేను మైమరిచిపోయాను. రిషబ్‌ శెట్టి.. ‘కాంతార’ విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన కోలాలు, భూతాలు, దైవాలను వెండితెర మీద గౌరవప్రదంగా, అందంగా ఆవిష్కరించారు. మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. మరింత ఎత్తుకు ఎదగాలని తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement