Friday, April 26, 2024

మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి జ్వరం…

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అయితే ఈ సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. రాజగోపాల్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఈరోజు ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉండగా.. జర్వం కారణంగా తన ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి రద్దు చేసుకున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం రాజగోపాల్ రెడ్డి తరఫున నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement