Thursday, May 2, 2024

DG-IG Conference: డీజీ-ఐజీ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ, అమిత్ షా

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో డీజీ-ఐజీ సదస్సు నిర్వ‌హించ‌నున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. ఈ స‌దస్సులో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన‌నున్నారు.

ఈ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే, ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల డీజీలు, ఐజీలు పాల్గొంటున్నారు. దీంతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల ఐజీ పోలీసులు కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. అయితే, ఈ సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతపై మేధోమథనంతో పాటు కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మహామంథన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) స్థాయికి చెందిన 250 మంది ఉన్నతాధికారులు పాల్గొంటారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు ఆన్‌లైన్‌లో పాల్గొనబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement