Friday, May 3, 2024

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి..నివాళుల‌ర్పించిన అద‌న‌పు క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్..

విపత్కర పరిస్థితుల్లో సమైక్యంగా, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, స్ఫూర్తి కి నిలువెత్తు నిదర్శనం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. భారత దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఆయన చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావుతో కలిసి ప్రతీక్ జైన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నామని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత దేశ తొలి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్దారన్నారు.

ఆయన మనందరిలో సమైక్య స్ఫూర్తి నింపారన్నారు. అంతే కాకుండా నిజాం నవాబు మెడలు వంచి భాగ్యనగరాన్ని నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుండి విముక్తి చేసిన ఉక్కు మనిషి అన్నారు. ఒక్క భాగ్యనగరాన్నే కాకుండా జునాఘఢ్ వంటి అనేక సంస్థానాలను భారత్ లో విలీనం చేశారన్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, భారతదేశాన్ని, దాని పటాన్ని పరిపూర్ణం చేయడంలో తన వంతు కృషి చేశార‌న్నారు. ఈ రోజు మనం చూస్తున్న భారతదేశం ఆయన కృషే వల్లే ఏర్ప‌డింద‌న్నారు.

దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్య నిష్టతో తీర్మానం చేస్తున్నాను.” అని అందరి తో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, ఏఓ ప్రమీల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement