Friday, May 3, 2024

ఆక్సిజన్ జనరేటర్..బయో మెడికల్ యూనిట్ ని ప్రారంభించిన వెంక‌య్య‌నాయుడు..

కృష్ణాజిల్లా:గన్నవరం మండలం చిన్న అవుటపల్లి లోని డా. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సంద‌ర్శించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ , కోవిడ్ సేవలకు టాటా ట్రస్ట్ అందజేసిన రూ 2.5 కోట్ల విలువచేసే బయోమెడికల్ పరికరాలు, న్యూరో కార్డియాక్ విభాగాలను ఆయ‌న ప్రారంభించారు. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల ఆక్సిజన్ జనరేటర్ & బయో మెడికల్ యూనిట్ ప్రారంభోత్సవం కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు వెంకయ్య నాయుడు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ , స్వర్ణభ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాసరావు , డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు , సిద్దార్థ ఆకాడమీ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement