Sunday, April 28, 2024

Philippines : భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.7గా నమోదు

ఫిలిప్పీన్స్ లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన ఈ భూ ప్రకంపనల వల్ల అక్కడి జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు తమ భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి పలు భవనాల పైకప్పులు కూలిపోయాయి.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రధాన దక్షిణ ద్వీపం మిండనావోలోని సారంగాని ప్రావిన్స్ లో 78 కిలోమీటర్ల (48 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిదని, అయితే సునామీ ముప్పు లేదని యుఎస్జీఎస్ తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారమూ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement