Saturday, April 27, 2024

స్పీకర్ పోచారం కారు ఢీకొని వ్యక్తి మృతి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కాళ్ళకల్ గ్రామంలో నివాసముంటున్న నర్సింహారెడ్డి(50) రోడ్డు దాటుతుండగా సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. నర్సింహారెడ్డి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement