Sunday, May 5, 2024

పుస్త‌కం రాసి క‌నీసం పేర్లు కూడా వేసులేకోని ద‌ద్ద‌మ్మ‌లు టిడిపి నేత‌లుః పేర్నినాని..

అమ‌రావ‌తి – మాజీ మంత్రి వివేకా హత్యపై టిడిపి విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో కనీసం టిడిపి పేరు గానీ, చంద్రబాబు, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు కూడా వేసుకోలేకపోయారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, టిడిపి ఒక అంతర్జాతీయ పార్టీ అని దాని ఏపీకి ఒక అధ్యక్షుడ‌ని అంటూ ఆయనకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి జగన్ ను మానసికంగా ఎంత కుంగదీయాలని చూసినా అది కుదరలేదని, అందుకే ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి పుస్తకాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

టిడిపి పుస్తకంలో జగన్ భార్య భారతమ్మ ఫోటో ప్రచురించడంపై నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్నాసి రాజకీయాల కోసం ఇంట్లో ఆడవారిని బైటకు లాగే టిడిపి నీచ సంస్కృతి మరిసారి బైటపడిందన్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ర‌ణంపైనా, కోడెల ఆత్మ‌హ‌త్య పైనా పుస్త‌కాలు ఎందుకు వేయ‌లేద‌ని టిడిపి నేత‌ల‌ను ఆయ‌న నిల‌దీశారు..
వివేకా హత్య సమయంలో ప్రభుత్వం ఎవరిది, ముఖ్యమంత్రి ఎవరు అంటూ ప్రశ్నించారు. అప్పుడేందుకు అవినాష్ రెడ్డిని ప్ర‌శ్నించ‌లేద‌నిఅన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి నిజంగా ఆధారాలు చెరిపేసి ఉంటే నాటి పోలీస్ శాఖ, ఇంటలిజెన్స్ డిజి ఏబీ వెంకటేశ్వర రావు ఏం చేశారని ప్ర‌శ్నించారు. వివేకా కుటుంబాన్ని కానీ, వివేకా కూతురుని కానీ ఎందుకు విచారణ చేయించలేదని నిలదీశారు. అవినాష్ రెడ్డిని ముద్దాయిగా ఎందుకు చూపలేదని అడిగారు. సిబిఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మీకు ఎలా వచ్చిందని అంటూ సిబిఐ వ్యవస్థలోకూడా మీకు కీలుబొమ్మలు ఉన్నారా అంటూ ఫైర్ అయ్యారు. సిబిఐ చంద్రబాబు డైరక్షన్ లో నడుస్తుందని అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సిఎం జగన్ పై నారా లోకేష్ ఉపయోగిస్తున్న భాషపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అలా తయారైనందుకు ఆయన తండ్రి బాబును అనాలని వ్యాఖ్యానించారు. లోకేష్ పద్దతిగా మాట్లాడాలని, ఒక సిఎం ను పట్టుకుని అలా మాట్లాడితే తాము కూడా బాబును అదేరకంగా మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement