Thursday, May 2, 2024

People’s March : గుమ్మ‌డ‌వెల్లి నుంచి భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్ర ప్రారంభం

నల్లగొండ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభ‌మైంది. గుమ్మడవెల్లి మీదుగా నాగార్జునసాగర్ నియోజకవర్గ పాల్వాయి గ్రామానికి పాద‌యాత్ర‌గా చేరుకున్నారు. గుమ్మ‌డ‌వెల్లి, పాల్వాయి, గుడిపల్లి క్రాస్ రోడ్, మైలవరం, జునుతల X రోడ్, తానేదార్పల్లి, చేపూర్ క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగ‌నుంది. లంచ్ బ్రేక్ మధ్యాహ్నం జునూతల క్రాస్ రోడ్ వద్ద ఉండ‌నుంది. చేపూరి క్రాస్ రోడ్ వద్ద ఈరోజు రాత్రికి భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement