Sunday, April 28, 2024

PBKS vs MI | చెల‌రేగిన ముంబై.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాద‌వ్ (78)తో హాఫ్ సెంచ‌రీ బాదాడు. పంబాబ్ బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ ఈ సీజ‌న్‌లో రెండో అర్ధ శ‌త‌కం సాధించాడు.

మరో వైపు తిల‌క్ వ‌ర్మ 18 బంతుల్లో 32 (నాటౌట్) పరుగులతో చెలరేగాడు. రోహిత్ శ‌ర్మ (36) పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషన్ ఇషాన్ కిషన్ (8)కే వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10), టిమ్ డేవిడ్ (14) పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు.

పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రాన్ రెండు, కగిసో రబడ ఒక్క వికెట్ తీశారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు 193 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement