Wednesday, May 1, 2024

అక్టోబరు 5 నుంచి పవన్ బస్సు యాత్ర-భిన్నంగా త‌యారీ

బ‌స్సుయాత్ర‌ని ప్రారంభించ‌నున్నారు ప‌వ‌ర్ స్టార్ ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఈ యాత్ర కోసం పవన్ కల్యాణ్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్సు పనులు చకచకా సాగుతున్నాయి. సెప్టెంబరు 26 నాటికి బస్సు పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. ఓ వర్క్ షాపులో ఈ బస్సు పనులు జరుగుతున్నాయి. లోపలి భాగంలోనూ పవన్ బస చేసేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దూరంగా ఉన్నవారికి సైతం పవన్ కనిపించేలా ఈ బస్సు టాప్ ను తీర్చిదిద్దుతున్నారు. సౌండ్ సిస్టమ్ ను సైతం ఈ బస్సుకే అటాచ్ చేయనున్నారు. ఇప్పటివరకు వివిధ నేతలు రాజకీయ యాత్రలకు ఉపయోగించిన బస్సులతో పోల్చితే ఇది భిన్నంగా కనిపిస్తుంది. నాడు ఎన్టీఆర్ వినియోగించిన చైతన్యరథానికి ఇది దగ్గరగా ఉంది. పవన్ బస్సుకు రెగ్యులర్ సైజు టైర్లు అమర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement